china: భారత్‌ పాఠాలు నేర్వాలి: చైనా ఆర్మీ హెచ్చ‌రిక‌

  • మరోసారి భారత్‌పై విషం కక్కిన చైనా
  • డోక్లాం సమస్య నుంచి భారత్‌ ఇప్పటికే పాఠాలు నేర్చుకుందని భావిస్తున్నాం
  • లేదంటే భవిష్యత్‌లో ఇటువంటి సమస్యలు మరిన్ని

గ‌త ఏడాది డోక్లాం విష‌యంలో భార‌త్, చైనా మధ్య ఉద్రిక్త‌త‌లు నెల‌కొన్న విష‌యం తెలిసిందే. ఆ విష‌యంలో చైనా ఇప్ప‌టికీ భార‌త్‌పై అక్క‌సుక‌క్కుతూనే ఉంది. తాజాగా చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) మ‌రోసారి భార‌త్ ను హెచ్చ‌రించింది. డోక్లాం సమస్య నుంచి భారత్‌ పాఠాలు నేర్వాలని, లేదంటే భవిష్యత్‌లో ఇటువంటి సమస్యలు మరిన్ని చోటు చేసుకుంటాయని తెలిపింది. చైనా రక్షణ శాఖ అధికార ప్రతినిధి వూ క్వియన్ కూడా ఇటువంటి వ్యాఖ్య‌లే చేశారు. డోక్లాం స‌మ‌స్య త‌లెత్తిన నేప‌థ్యంలో ఇప్ప‌టికే భార‌త్ పాఠాలు నేర్చుకుంద‌నే తాము భావిస్తున్న‌ట్లు పేర్కొన్నారు.   

  • Loading...

More Telugu News