india: జోహన్స్‌బర్గ్‌ టెస్ట్: 187 పరుగులకే టీమిండియా ఆలౌట్

  • కోహ్లీ, పుజారా మినహా విఫలమైన టీమిండియా బ్యాట్స్‌మెన్‌
  • అర్ధ సెంచరీలు చేసిన కోహ్లీ, పుజారా
  • దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడాకి మూడు వికెట్లు

జోహన్స్‌బర్గ్‌లో జ‌రుగుతోన్న చివరి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లోనూ టీమిండియా బ్యాట్స్‌మెన్ పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బౌలర్లు విసురుతోన్న బంతులకు క్రీజులో ఎక్కువ సేపు నిలవలేకపోయారు. కోహ్లీ, పుజారా మినహా ఏ బ్యాట్స్ మెన్ చెప్పుకోదగ్గ పరుగులు చేయలేదు. టీ

మిండియా బ్యాట్స్ మెన్‌లో లోకేశ్ రాహుల్ 0, మురళీ విజయ్ 8, విరాట్ కోహ్లీ 54, అజింక్యా రహానె 9, ఛటేశ్వర్ పుజారా 50, పార్థివ్ పటేల్ 2, హార్థిక్ పాండ్యా 0, భువనేశ్వర్ కుమార్ 30, షమీ 8, ఇషాంత్ శర్మ 0, బుమ్రా 0 (నాటౌట్) చేశారు. టీమిండియాకు ఎక్స్ ట్రాల రూపంలో 26 పరుగులు వచ్చాయి. దీంతో మొదటి ఇన్నింగ్స్ లో 187 (76.4) పరుగులు చేయగలిగింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో రబాడా 3, మార్కెల్, ఫిలండర్, అండిలే రెండేసి చొప్పున వికెట్లు తీయగా ఎన్గిడీకి ఒక వికెట్ దక్కింది. 

  • Loading...

More Telugu News