India: నాలుగు వికెట్లు కోల్పోయిన టీమిండియా

  • టీమిండియా స్కోరు 114/4 (53 ఓవర్లకి)
  • అర్ధ సెంచరీ బాది ఔటైన విరాట్‌ కోహ్లీ
  • క్రీజులో ఛటేశ్వర్ పుజారా (27), పార్థివ్ పటేల్ (0)

జోహన్స్‌బర్గ్‌లో జ‌రుగుతోన్న‌ దక్షిణాఫ్రికా, భార‌త్ చివరి టెస్టు మ్యాచ్‌లో బ్యాటింగ్ చేస్తోన్న టీమిండియా నాలుగు వికెట్లు కోల్పోయింది. ఓపెనర్లు లోకేశ్ రాహుల్ 0, మురళీ విజయ్ 8 పరుగులకే ఔట్ అయిన విషయం తెలిసిందే.

అనంతరం క్రీజులో ధాటిగా ఆడిన విరాట్ కోహ్లీ 54 పరుగుల వ్యక్తిగత స్కోరుకి వెనుదిరగగా, తరువాత కొద్ది సేపటికే అజింక్యా రహానె 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో ఛటేశ్వర్ పుజారా 27, పార్థివ్ పటేల్ 0 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 114/4 (53 ఓవర్లకి) గా ఉంది. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కెల్, ఫిలండర్, రబాడా, ఎన్గిడీలకు తలో వికెట్ దక్కాయి.

  • Loading...

More Telugu News