Pawan Kalyan: ఖమ్మంలో పవన్ కల్యాణ్ ర్యాలీ.. చెప్పు విసిరిన గుర్తుతెలియని వ్యక్తి!

  • ఖమ్మంలో ‘జనసేన’ అధ్యక్షుడు
  • ఓపెన్ టాప్ కారులో పవన్ వెళుతుండగా సంఘటన
  • జనసేనానిని చూసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిరంతర యాత్రలో భాగంగా ఈ రోజు ఆయన ఖమ్మంలో పర్యటిస్తున్నారు. అయితే, ఈ పర్యటనలో ఉన్న ఆయనపై గుర్తుతెలియని వ్యక్తి ఒకరు చెప్పు విసరడం కలకలం రేపింది. ఓపెన్ టాప్ కారులో అభిమానులకు అభివాదం చేస్తూ వెళుతున్న పవన్ ని చూసేందుకు అభిమానులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

ఈ క్రమంలో ఆయన వాహనం స్థానిక తల్లాడ సెంటర్ కు చేరుకున్న సమయంలో పవన్ అభిమానులు, పార్టీ కార్యకర్తలతో ఆ ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆ సమూహంలో నుంచి ఓ గుర్తుతెలియని వ్యక్తి చెప్పు విసరడంతో అది పవన్ కారుపై పడటం గమనార్హం. అనంతరం, అక్కడి ఏబీ గార్డెన్స్ లో ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ జిల్లాల కార్యకర్తలతో పవన్ కల్యాణ్ సమావేశమయ్యారు.

  • Loading...

More Telugu News