shivsena: శివసేన ప్రకటనను లైట్ గా తీసుకున్న బీజేపీ

  • వచ్చే ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామన్న బీజేపీ
  • ఏం జరుగుతుందో చూద్దామన్న ఫడ్నవిస్
  • 'మహా'లో మరోసారి బీజేపీదే అధికారమన్న సీఎం

బీజేపీతో ఎన్నో ఏళ్లుగా ఉన్న స్నేహాన్ని తెగదెంపులు చేసుకున్నట్టు శివసేన చేసిన ప్రకటనను బీజేపీ చాలా తేలికగా తీసుకుంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీతో కలసి పోటీ చేయరాదని, ఒంటరిగానే బరిలోకి దిగాలని శివసేన నేడు తీర్మానించింది. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ మాట్లాడుతూ, ప్రస్తుత పరిణామాలపై బీజేపీ వేచి చూసే ధోరణిని అవలంబిస్తుందని అన్నారు. ఎన్నో విషయాలపై శివసేన మాట్లాడుతోందని... ఏం జరుగుతుందో వేచి చూద్దామని చెప్పారు. మహారాష్ట్రలో మరోసారి అధికారం బీజేపీదే అని అన్నారు.

  • Loading...

More Telugu News