pavan: చెన్నై లోను 'అజ్ఞాతవాసి' రికార్డు స్థాయి వసూళ్లు

  • తెలుగు రాష్ట్రాల్లో 'అజ్ఞాతవాసి' సందడి 
  • ఓవర్సీస్ లో చూపుతోన్న హవా
  • చెన్నై లోను రికార్డు స్థాయి వసూళ్లు

భారీ అంచనాల మధ్య పవన్ కల్యాణ్ 'అజ్ఞాతవాసి' నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది. ఓవర్సీస్ లోనే ప్రీమియర్స్ రూపంలో 1.5 మిలియన్ డాలర్లను రాబట్టిన ఈ సినిమా, ఈ విషయంలో 'బాహుబలి' రికార్డును తుడిచిపెట్టేసిన సంగతి తెలిసిందే.

 ఇక చెన్నై లోను ఈ సినిమా తన హవా చూపించినట్టుగా చెబుతున్నారు. నిన్న ఒక్క రోజులోనే ఈ సినిమా 24 లక్షల గ్రాస్ ను సాధించినట్టుగా చెబుతున్నారు. ఇవి రికార్డు స్థాయి వసూళ్లని అంటున్నారు. సంక్రాంతి సెలవుల కారణంగా తెలుగు రాష్ట్రాలతో పాటు .. చెన్నైలోను ఈ సినిమా వసూళ్లు మరింతగా పెరిగే ఛాన్స్ ఉందని టాక్. ఇక ఓవర్సీస్ లో త్రివిక్రమ్ .. పవన్ లకి గల క్రేజ్ ఈ సినిమాను వసూళ్ల పరంగా పరుగులు తీయిస్తుందనే అభిప్రాయాలూ వ్యక్తమవుతున్నాయి.      

  • Loading...

More Telugu News