ntr: ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్: నారా భువనేశ్వరి

  • జనవరి 18న దేశ వ్యాప్తంగా 150 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు
  • 16 రాష్ట్రాలు, 300 బ్లడ్ బ్యాంకులతో భాగస్వామ్యం 
  • ‘ఫేస్ బుక్’ తో కలిసి రక్తదానంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తాం: మీడియతో నారా భువనేశ్వరి

ఎన్టీఆర్ వర్థంతి సందర్భంగా లెజండరీ బ్లడ్ డొనేషన్ డ్రైవ్ నిర్వహించనున్నట్టు ఏపీ సీఎం చంద్రబాబునాయుడు సతీమణి, ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ మేనేజింగ్ ట్రస్టీ నారా భువనేశ్వరి తెలిపారు. ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ, జనవరి 18న దేశ వ్యాప్తంగా 150 కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు నిర్వహించనున్నట్టు చెప్పారు. 16 రాష్ట్రాలు, 300 బ్లడ్ బ్యాంకులతో భాగస్వామ్యం అవుతున్నామని, ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ఫేస్ బుక్’ తో కలిసి రక్తదానంపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పారు.

  • Loading...

More Telugu News