Gadwal: నెత్తురోడిన తెలంగాణ రోడ్డు... ఘోర ప్రమాదంలో ఆరుగురు మృతి

  • గద్వాల సమీపంలో ప్రమాదం
  • మరో 25 మందికి గాయాలు
  • అందరూ కూలీలే
  • సంక్రాంతికి ఇళ్లకు వెళుతుండగా ఘోరం

తెలంగాణ పరిధిలోని గద్వాల సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురిని బలితీసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, ధరూర్ మండలం పార్ చర్ల బస్టాపు వద్ద వేగంగా వస్తున్న బొలెరో వాహనం అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు కూలీలు అక్కడికక్కడే మృతి చెందారు. వాహనంలోని మరో 25 మందికి గాయాలయ్యాయి.

వీరిని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తుండగా, కొందరి పరిస్థితి విషమంగా ఉంది. వీరంతా గద్వాలలోని జిన్నింగ్ మిల్లులో పనిచేసే కూలీలని, సంక్రాంతి పండగ కోసం స్వగ్రామాలకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తమ ప్రాథమిక విచారణలో తేల్చారు. అతి వేగం, పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించడంతో పాటు డ్రైవర్ నిద్రమత్తు కూడా కారణాలని తెలిపారు.

  • Loading...

More Telugu News