Cricket: టీమిండియా బ్యాట్స్ మెన్ ఘోర వైఫల్యం.. స్కోరు 87/6

  • దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో తొలి టెస్టు
  • పుజారా, రోహిత్ శర్మ కూడా తక్కువ పరుగులకే ఔట్
  • క్రీజులో హార్దిక్ పాండ్యా (11), వృద్ధిమాన్ సాహా (0)

దక్షిణాఫ్రికాలోని కేప్‌టౌన్‌లో జరుగుతోన్న భారత్, సౌతాఫ్రికా తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో దక్షిణాఫ్రికా నిన్న 286 పరుగులకి ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. 28/3 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియా ఏ మాత్రం పోరాటపటిమను కనబర్చలేకపోతోంది.

 రాణిస్తారనుకున్న పుజారా, రోహిత్ శర్మ కూడా తక్కువ పరుగులకే అవుటయ్యారు. భారత బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ 1, శిఖర్ ధావన్ 16, చటేశ్వర పుజారా 26, విరాట్ కోహ్లీ 5, రోహిత్ శర్మ 11, రవిచంద్రన్ అశ్విన్ 12 పరుగుల వ్యక్తి గత స్కోర్ల వద్ద అవుటయ్యారు. ప్రస్తుతం క్రీజులో హార్దిక్ పాండ్యా 11, వృద్ధిమాన్ సాహా 0 పరుగులతో ఉన్నారు. ప్రస్తుతం టీమిండియా స్కోరు 87/6 (40 ఓవర్లకి) గా ఉంది.

  • Loading...

More Telugu News