agnyaathavaasi: మా సినిమా చూడడానికి రండి... మంత్రి తలసానిని కలిసి, ఆహ్వానించిన త్రివిక్రమ్!

  • ఈ నెల 10న రానున్న అజ్ఞాతవాసి
  • సినిమా చూడాలని కోరిన త్రివిక్రమ్
  • మంత్రిని కలిసిన వారిలో చిత్ర నిర్మాత, F D C చైర్మన్ కూడా 

పవన్ కల్యాణ్ నటించిన 'అజ్ఞాతవాసి' చిత్రం ఈ నెల 10వ తేదీన విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను సెక్రటేరియట్ లో కలిసి, అజ్ఞాతవాసి చిత్రాన్ని చూసేందుకు రావాలని కోరారు. త్రివిక్రమ్ తో పాటు మంత్రిని కలిసిన వారిలో నిర్మాత రాధాకృష్ణ, F D C చైర్మన్ రామ్మోహన్ రావు కూడా ఉన్నారు.

  • Loading...

More Telugu News