gopichand: గోపీచంద్ .. మెహ్రీన్ సినిమా టైటిల్ 'పంతం'?

  • షూటింగు దశలో గోపీచంద్ 25వ మూవీ
  • కథానాయికగా మెహ్రీన్ 
  • సెంటిమెంట్ ను వదలని గోపీచంద్  

గోపీచంద్ కథానాయకుడిగా చక్రి దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. గోపీచంద్ కి ఇది 25వ సినిమా కావడం విశేషం. కె.కె.రాధామోహన్ నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమా, ఇటీవలే సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ ను ఎంపిక చేసుకున్నారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.

 ఇంతవరకూ గోపీచంద్ చేసిన పాత్రలకు ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని అంటున్నారు. అందువల్లనే 25 వ సినిమాగా దీనిని ఓకే చేశారని అంటున్నారు. మెహ్రీన్ టీచర్ గా కనిపిస్తుందట .. ఈ పాత్రలో ఆమె చాలా కొత్తగా కనిపిస్తుందని చెబుతున్నారు. తాజాగా ఈ సినిమాకి 'పంతం' అనే టైటిల్ ను ఫిక్స్ చేయనున్నట్టు తెలుస్తోంది. చివరిలో 'సున్నా' వచ్చేలా టైటిల్ ను సెట్ చేయడం గోపీచంద్ కి సెంటిమెంట్. 'యజ్ఞం' .. 'లక్ష్యం' .. 'లౌక్యం' లానే ఈ సినిమాకి 'పంతం' టైటిల్ ను ఖరారు చేయనున్నారని అంటున్నారు. వేసవిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

  • Loading...

More Telugu News