Balakrishna: తమిళంలో భారీస్థాయిలో 'జై సింహా' రీమేక్!

  • బాలకృష్ణ డాన్సులు అదుర్స్ 
  • మరింత హ్యాండ్సమ్ గా ఆయన కనిపిస్తారు 
  • ముందుగా అనుష్కను అనుకున్నాం

తమిళంలో స్టార్ హీరోలతో ఎన్నో సినిమాలు చేసిన దర్శకుడు కె.ఎస్. రవికుమార్, అనూహ్యమైన విజయాలను అందుకున్నారు. తాజాగా బాలకృష్ణతో ఆయన చేసిన 'జై సింహా' సినిమా, ఈ నెల 12వ తేదీన భారీస్థాయిలో విడుదల చేస్తున్నారు. నయనతారతో పాటు నటాషా దోషి .. హరిప్రియ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను సి.కల్యాణ్ నిర్మించారు.

 తాజాగా ఆయన మాట్లాడుతూ, ఈ సినిమాలో బాలకృష్ణ డాన్సులు ఆయన అభిమానులకు పండగ చేస్తాయని చెప్పారు. గత చిత్రాల్లోకంటే ఈ సినిమాలో బాలకృష్ణ హ్యాండ్సమ్ గా కనిపిస్తారని అన్నారు. తెలుగుతో పాటు తమిళంలోను ఈ సినిమాను విడుదల చేయాలనుకున్నామనీ, అయితే దర్శకుడు కె.ఎస్. రవికుమార్ ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేస్తామని చెప్పారని అన్నారు. ఈ కారణంగానే ఈ సినిమాను తమిళంలో రిలీజ్ చేయడం లేదని అన్నారు. ముందుగా ఈ సినిమా కోసం అనుష్కను అనుకున్నామనీ, ఆమె డేట్స్ కుదరకపోవడం వలన నయనతారను ఎంపిక చేసుకున్నామని చెప్పుకొచ్చారు.    

  • Loading...

More Telugu News