chiranjeevi: పొల్లాచ్చికి బయలుదేరనున్న 'సైరా' టీమ్

  • ఫస్టు షెడ్యూల్ పూర్తి చేసుకున్న 'సైరా'
  • రెండవ షెడ్యూల్ కి సన్నాహాలు 
  • వచ్చేనెల ఫస్టువీక్ లో మొదలు    

చిరంజీవి అభిమానుల నిరీక్షణకు తెరదింపేస్తూ .. కొన్ని రోజుల క్రితమే 'సైరా' సినిమా షూటింగ్ మొదలైంది. మొదటి షెడ్యూల్ లో భారీ పోరాట సన్నివేశాలను చిత్రీకరించారు. ఆ తరువాత షెడ్యూల్ ను తమిళనాడు - పొల్లాచ్చిలో ప్లాన్ చేశారు. ఫిబ్రవరి మొదటివారం నుంచి ఈ షెడ్యూల్ మొదలుకానుంది. ఈ షెడ్యూల్ లోను భారీ యాక్షన్ సీన్స్ నే ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది.

ఇక్కడ చిత్రీకరించబోయే సన్నివేశాలు, ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ యాక్షన్ సన్నివేశాలను సురేందర్ రెడ్డి కొత్తగా డిజైన్ చేయించాడని అంటున్నారు. నయనతార కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో, అమితాబ్ .. సుదీప్ .. విజయ్ సేతుపతి ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు ఎవరనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.   

  • Loading...

More Telugu News