Vijayawada: దుర్గ గుడిలో తాంత్రిక పూజలకు ఆధారాలు.. సీసీ కెమెరాలో నిక్షిప్తం!

  • ఆరోజు రాత్రి 10.30 నిమిషాలకు అంతరాలయంలోకి వెళ్లిన అనధికార పూజారి రాజా
  • గుమ్మడికాయ, ఇతర పూజాసామాగ్రి తీసుకెళ్లిన వైనం
  • సీసీ కెమెరాలో దృశ్యాలు

విజయవాడ దుర్గ గుడిలో ఇటీవల తాంత్రిక పూజలు జరిగాయనే కథనాలు మీడియాలో వెలువడుతున్న విషయం తెలిసిందే. ఈ వార్తలను దుర్గ గుడి ఈవో సూర్యకుమారి ఖండించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అసలు విషయం బయటపడింది. ఆరోజు రాత్రి 10.30 నిమిషాలకు అంతరాలయంలోకి అనధికార పూజారి రాజా వెళ్లినట్లు సీసీ కెమెరా ఆధారంగా తేలింది. తాంత్రిక పూజల నిమిత్తం గుమ్మడికాయ, ఇతర పూజాసామాగ్రిని తీసుకెళ్తున్నట్టు అందులోని దృశ్యాల ఆధారంగా తెలుస్తోంది.

  • Loading...

More Telugu News