fire accident: కడప జిల్లాలో సిలిండ‌ర్ పేలడంతో భారీ అగ్ని ప్ర‌మాదం.. వెయ్యి గుడిసెలు ద‌గ్ధం

  • క‌డ‌ప జిల్లా బ‌ద్వేలులో ఘ‌ట‌న‌
  • గుడిసెల్లో పేద‌ల‌ సామ‌గ్రి అంతా ద‌గ్ధం
  • మంటలు ఆర్పుతోన్న అగ్నిమాప‌క సిబ్బంది

క‌డ‌ప జిల్లా బ‌ద్వేలులో భారీ అగ్ని ప్ర‌మాదం చోటు చేసుకుంది. సిలిండ‌ర్ పేలి మంట‌లు చెల‌రేగ‌డంతో సుమారు వెయ్యి గుడిసెలు ద‌గ్ధమ‌య్యాయి. త‌మ సామ‌గ్రి అంతా నాశ‌నం అవుతోంద‌ని పేద‌లు బోరున విల‌పిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను ఆర్పుతున్నారు. ఈ ఘ‌ట‌న‌లో పేద‌ల సామ‌గ్రి పూర్తిగా కాలిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌లో ప్రాణ‌న‌ష్టం జ‌రిగిందా? అనే విష‌యంపై వివ‌రాలు తెలియాల్సి ఉంది.            

  • Loading...

More Telugu News