Chandrababu: అడ్డంగా దొరికిపోయి.. నెపాన్ని అధికారులపై నెడుతున్నారు: చంద్రబాబుపై రోజా విమర్శలు

  • లోకేశ్ కోసమే దుర్గ గుడిలో తాంత్రిక పూజలు
  • ఎప్పుడూ అధికారంలో ఉండాలనే స్వార్థం
  • చంద్రబాబును పీఠాధిపతులు నిలదీయాలి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే రోజా తీవ్ర విమర్శలు గుప్పించారు. ఆయన చేసిన తప్పుకు మహిళా అధికారిని బలి చేశారని అన్నారు. విజయవాడ కనకదుర్గమ్మ గుడిలో తాంత్రిక పూజలు జరిగాయనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ అంశంపై రోజా మాట్లాడుతూ, కొడుకు లోకేశ్ కోసమే చంద్రబాబు క్షుద్ర పూజలు చేయించారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అయితే, అడ్డంగా దొరికిపోయేసరికి ఆ నెపాన్ని అధికారులపై నెడుతున్నారని అన్నారు. ఆయన, ఆయన కుమారుడు లోకేశ్ ఎప్పుడూ అధికారంలో ఉండాలన్న స్వార్థంతోనే తాంత్రిక పూజలు చేయించారని ఆరోపించారు. పవిత్రమైన ఆలయంలో ఇలాంటి పూజలు చేయించడం అరిష్టమని చెప్పారు. ఇలాంటి విషయాలపై చంద్రబాబును పీఠాధిపతులు నిలదీయాలని అన్నారు. 

  • Loading...

More Telugu News