Pawan Kalyan: కేసీఆర్‌ను కలిసి, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్!

  • 6.30కి ప్రగతి భవన్‌కు పవన్ కల్యాణ్
  • ఆ సమయంలో రాజ్‌భవన్‌లో ఉన్న కేసీఆర్
  • సుమారు 7.30కి కేసీఆర్‌తో పవన్ భేటీ

జ‌న‌సేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ హైద‌రాబాద్‌లో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా క‌లిశారు. కేసీఆర్‌కి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా కొద్దిసేపు కేసీఆర్‌తో పలు అంశాలపై చర్చించారు.

కాగా, ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు పవన్ కల్యాణ్ సాయంత్రం 6.30కి వెళ్లారు. అయితే, ఆ సమయంలో ముఖ్య‌మంత్రి రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ వద్ద ఉన్నారు. దీంతో పవన్ ప్రగతి భవన్‌ను సందర్శించారు. అనంతరం సుమారు 7.30కు కేసీఆర్ ప్రగతి భవన్‌కు వచ్చినట్లు సమాచారం. 

  • Loading...

More Telugu News