Chandrababu: ‘పోలవరం’ పూర్తి చేసి, జాతికి అంకిత చేసే వరకు నిద్రపోను: సీఎం చంద్రబాబు భావోద్వేగం

  • ప్రకాశం బ్యారేజ్ నిర్మించి అరవై ఏళ్లు పూర్తి
  • దుర్గాఘాట్ వద్ద కృష్ణమ్మకు పూజలు  
  • ‘పోలవరం’ పూర్తి చేయాలన్నదే నా జీవితాశయం : చంద్రబాబు

పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, జాతికి అంకితం చేసే వరకు తాను నిద్రపోనంటూ ఏపీ సీఎం చంద్రబాబునాయుడు భావోద్వేగం చెందారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజ్ నిర్మించి 60 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా దుర్గాఘాట్ వద్ద నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబుతో పాటు మంత్రి దేవినేని ఉమ, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, బిల్లులు సకాలంలో చెల్లిస్తే పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని, 2018 జూన్ నాటికి గ్రావిటీతో నీళ్లు ఇవ్వాలనేది తన ఆలోచనని, ఈ నిర్మాణం పూర్తి చేయాలన్నదే తన జీవితాశయమని మరోమారు స్పష్టం చేశారు. ఈ ఏడాది 12.5 శాతం వర్షపాతం తక్కువ పడిందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా 6.50 లక్షల పంటకుంటలు తవ్వామని, వాటి ద్వారా వర్షపు నీటిని భూగర్భ జలాలుగా మార్చామని అన్నారు.

అంతకుముందు, కృష్ణమ్మకు చంద్రబాబు, ఉమ పూజలు చేశారు. టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. 60 వసంతాల ప్రకాశం బ్యారేజ్ సంచికను చంద్రబాబు ఆవిష్కరించారు. 

  • Loading...

More Telugu News