nikhil: జనవరిలో సెట్స్ పైకి నిఖిల్ న్యూ మూవీ!

  • షూటింగ్ ముగింపు దశలో 'కిరిక్ పార్టీ'
  • తదుపరి సినిమాగా 'కణిథన్' రీమేక్ 
  • తరువాత సినిమా చందూ మొండేటితో

కొత్తదనంతో కూడిన పాత్రలకు ప్రాధాన్యతనిస్తూ వెళుతోన్న నిఖిల్, ప్రస్తుతం కన్నడ రీమేక్ గా 'కిరిక్ పార్టీ' చేస్తున్నాడు. షూటింగ్ పరంగా ఈ సినిమా చివరి దశకి చేరుకోవడంతో, తదుపరి సినిమాపై దృష్టి పెట్టాడు. ఆల్రెడీ తదుపరి సినిమాగా ఆయన తమిళ రీమేక్ 'కణిథన్' చేయనున్నాడు. ఆ సినిమాకి సంబంధించిన సన్నాహాలు మొదలైపోయాయి.

 ఠాగూర్ మధు నిర్మాతగా వ్యవహరిస్తోన్న ఈ సినిమాను, వచ్చేనెల 19వ తేదీన సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే 'కిరిక్ పార్టీ' విడుదలవుతోంది. ఇక తమిళ రీమేక్ ను మూడు నెలల్లో పూర్తి చేసి ద్వితీయార్థంలో రిలీజ్ చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో నిఖిల్ వున్నాడట. ఆ తరువాత సినిమాను చందూ మొండేటితో చేసే ఆలోచనలో ఆయన వున్నాడు. ఈ సినిమాను వచ్చే ఏడాది తృతీయార్ధంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనుకుంటున్నాడట. మొత్తానికి నిఖిల్ నుంచి వచ్చే ఏడాది మూడు సినిమాలు రానున్నాయన్న మాట.    

  • Loading...

More Telugu News