BJP: పాక్ కు 'చెప్పు' దెబ్బ: పాకిస్థాన్‌ హైకమీషనర్ పేరిట ఆన్‌లైన్‌లో చెప్పులను ఆర్డర్‌ చేసే ఉద్యమాన్ని ప్రారంభించిన బీజేపీ నేత‌!

  • త‌న మ‌ద్ద‌తుదారులంతా అలాగే చేయాల‌ని పిలుపు
  • దాని స్క్రీన్‌షాట్‌ను #jutabhejopakistan హ్యాష్‌ట్యాగ్‌కు జత చేయాల‌ని సూచ‌న‌
  • కుల్‌భూష‌ణ్ జాద‌వ్ త‌ల్లీ, భార్య‌కు జ‌రిగిన అవ‌మానానికి నిరసన 

బీజేపీ ఢిల్లీ అధికార ప్రతినిధి తజేందర్‌ బగ్గా, ఢిల్లీలోని పాకిస్థాన్ హైకమీషనర్ పేరిట ఆన్‌లైన్‌లో చెప్పులను ఆర్డర్‌ చేసి, దానికి సంబంధించిన‌ స్క్రీన్‌ షాట్‌ను ట్విట్ట‌ర్ ఖాతాలో పోస్ట్ చేస్తూ త‌మ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌కు ఓ పిలుపునిచ్చారు. తాను ఆ చెప్పుల‌ను పాకిస్థాన్‌ హైకమిషన్‌కు పంపుతున్నాన‌ని, త‌న మ‌ద్ద‌తుదారులంతా త‌నలాగే చెప్పుల‌ను ఆర్డ‌ర్ చేసి దాని స్క్రీన్‌షాట్‌ను #jutabhejopakistan హ్యాష్‌ట్యాగ్‌కు జత చేసి పంపాల‌ని కోరారు. కుల్‌భూషణ్‌ జాదవ్‌ను చూడ‌డానికి వెళ్లిన ఆయ‌న‌ తల్లి, భార్య పట్ల పాకిస్థాన్ తీరును ఈ విధంగా ఖండించాల‌ని సూచించారు. ఆయ‌న చేసిన ఈ ట్వీట్ వైర‌ల్‌గా మారింది.      

  • Loading...

More Telugu News