India: దక్షిణాఫ్రికాలో అడుగుపెట్టిన భారత క్రికెటర్లు!

  • వచ్చేనెల 5న తొలి టెస్టు
  • బలంగా ఉన్న ఇరు జట్లు
  • టెస్టుల్లో టీమిండియా అగ్రస్థానం
  • వన్డేల్లో సౌత్రాఫ్రికా అగ్రస్థానం

వ‌రుస విజ‌యాల‌తో జోరు మీదున్న టీమిండియా.. ద‌క్షిణాఫ్రికాతో ఆట‌కు సిద్ధ‌మవుతోంది. ఇరు దిగ్గజ జట్ల మధ్య వ‌చ్చే నెల 5 నుంచి టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టీమిండియా దక్షిణాఫ్రికాలోని కేప్ టౌన్ చేరుకుంది. ఈ సిరీస్‌కు టీమిండియాకు విరాట్ కోహ్లీ సారథ్యం వహిస్తున్నాడు. తన భార్య అనుష్క శర్మతో కలిసి కోహ్లీ ఇప్పటికే అక్కడికి చేరుకున్నాడు.

ప్ర‌స్తుతం టెస్టుల్లో ఇండియా 124 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా, సౌతాఫ్రికా 111 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక వన్డేల్లో సౌతాఫ్రికా 120 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా టీమిండియా 119 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దీంతో ఇరు జట్ల మధ్య హోరా హోరీ పోరు జరుగుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News