Rajanna Sirisilla: కలసి చనిపోదామంటే వద్దన్న ప్రియురాలు... కొట్టి చంపి, ఆత్మహత్య చేసుకున్న ప్రియుడు!

  • రాజన్న సిరిసిల్ల జిల్లాలో కలకలం
  • కులాలు వేరుకావడంతో పెళ్లికి అంగీకరించని పెద్దలు
  • చనిపోదామంటే విభేదించిన ప్రియురాలు సుస్మిత
  • హత్య చేసి, తానూ ఆత్మహత్య చేసుకున్న మధు

మనస్ఫూర్తిగా ప్రేమించిన ప్రియురాలు వివాహానికి అంగీకరించకపోవడంతో ఓ యువకుడు ఉన్మాదిగా మారాడు. ఆమెను చంపి, తానూ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో కలకలం రేపింది. మరిన్ని వివరాల్లోకి వెళితే, మధు (25) హైదరాబాద్ లో పని చేస్తుంటాడు. ఇతని స్వగ్రామం ముస్కాన్ పేటలో సమీపంలోనే సుస్మిత (22) బీఈడీ చదువుతుండగా, గత ఐదేళ్లుగా ఇద్దరి మధ్యా ప్రేమ వ్యవహారం ఉంది.

కులాలు వేరుకావడం, సుస్మిత పుట్టగానే భర్త తనను వదిలేసి వెళ్లడంతో ఆమె తల్లి వెంకటమ్మ ఈ పెళ్లికి అంగీకరించలేదు. దీంతో దూరంగా ఉంటున్నట్టు ఇద్దరూ నటించారు. నిన్న గురువారం నాడు సిద్ధిపేటలో ఫ్రెండ్ వివాహం జరుగగా, దానికి వచ్చిన మధు, సుస్మితకు ఫోన్ చేసి రమ్మని చెప్పాడు. ఆమె వచ్చింది. అప్పటికే తన వెంట కూల్ డ్రింక్, పురుగుల మందును తెచ్చిన మధు, కలసి చనిపోదామని చెప్పాడు. దీనికి సుస్మిత ఎంతమాత్రమూ అంగీకరించలేదు.

అతనితో విభేదించి వెళ్లిపోవడానికి నిశ్చయించుకోగా, మధులోని ఉన్మాది బయటకు వచ్చాడు. ఆమెను తీవ్రంగా కొట్టాడు. స్పృహ కోల్పోయిన ఆమె మెడకు ఉరి బిగించి హత్య చేశాడు. ఆపై అక్కడే తాను కూడా ఉరేసుకున్నాడు. ఉరేసుకునే ముందు తాను చేసిన పనిని తన స్నేహితుడికి చెప్పాడు. దీంతో హుటాహుటిన స్నేహితులు వచ్చి చూడగా, ఇద్దరూ విగత జీవులుగా కనిపించారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News