samantha: ‘ఇరుంబు తిరై’ షూటింగ్ పూర్తి.. విశాల్ కు కేక్ తినిపించిన సమంత!

  • విశాల్ సొంత బ్యానర్ లో వస్తున్న చిత్రం ‘ఇరుంబు తిరై’
  • ఈ చిత్రం చివరి రోజు షూటింగ్
  • ట్వీట్ చేసిన హీరో విశాల్

పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో హీరో విశాల్ సరసన సమంత నటిస్తున్న తమిళ చిత్రం ‘ఇరుంబు తిరై’. ఈ చిత్రం షూటింగ్ పూర్తి అయిన విషయాన్ని విశాల్ తన ట్వీట్ లో చెప్పాడు. ఈ చిత్రం చివరి రోజు షూటింగ్ జరిగిందని పేర్కొన్న విశాల్, ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసిన ఫొటోలను పోస్ట్ చేశాడు.

ఈ ఫొటోలలో సమంత, హీరో విశాల్ కు కేక్ తినిపించబోతున్న ఫొటో కూడా ఉంది. కాగా, విశాల్ సొంత బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాను జనవరి 26వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలో డాక్టర్ రతీదేవి పాత్రను సమంత పోషిస్తోంది.  

  • Loading...

More Telugu News