Hyderabad: సికింద్రాబాద్ లో ప్రపంచ పతంగుల పండగతో పాటు 'స్వీట్' ఫెస్టివల్!

  • జనవరి 13 నుంచి 15 వ తేదీ వరకు పతంగుల పండగ
  • అనుబంధంగా స్వీట్ ఫెస్టివల్
  • తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ప్రకటన  

ప్రపంచ పతంగుల పండగకు అనుబంధంగా స్వీట్ ఫెస్టివల్ ను నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. జనవరి 13 నుంచి 15 వ తేదీ వరకు సికింద్రాబాద్ లోని పరేడ్ మైదానంలో ప్రపంచ పతంగుల పండగ నిర్వహించనున్నట్టు తెలంగాణ టూరిజం, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం తెలిపారు.

ఈ సందర్భంగా బేగంపేటలోని టూరిజం ప్లాజా హోటల్ లో వివిధ రాష్ట్రాల సాంస్కృతిక సంఘాల ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, హైదరాబాద్ నగరంలో నివసించే వివిధ రాష్ట్రాల, దేశాల  ప్రజల సాంస్కృతిక అంశాలను, ఆహారపు అలవాట్లను ప్రతిబింబించే విధంగా ఈ స్వీట్ ఫెస్టివల్ ను రూపొందించాలని నిర్ణయించినట్టు చెప్పారు.

దేశంలోని ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకత కలిగిన స్వీట్లు  ఉన్నాయని అన్నారు. ఈ ఫెస్టివల్ లో సుమారు 25 రాష్ట్రాలకు సంబంధించిన స్వీట్లను ఒకే చోట అందించనున్నట్టు చెప్పారు. దాదాపు ప్రతి రాష్ట్రం నుండి 50 రకాల స్వీట్లను ప్రదర్శించడంతోపాటు 1000 రకాల స్వీట్లను అమ్మకానికి ఉంచనున్నట్టు తెలిపారు.  

  • Loading...

More Telugu News