narasimhan: తండ్రీకొడుకులు ఇద్దరూ కలసి సాధించిన విజయం ఇది: గవర్నర్ నరసింహన్

  • ఏపీకి సంతోషకరమైన రోజులు వచ్చాయి
  • టెక్నాలజీ ద్వారా ప్రజలకు చంద్రబాబు, లోకేశ్ ఆనందాన్ని అందిస్తున్నారు
  • అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారు
  • ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వం అత్యున్నతమైన సౌకర్యాలు కల్పించింది

ఏపీకి సంతోషకరమైన రోజులు వచ్చాయని, టెక్నాలజీ ద్వారా ప్రజలకు ఆనందాన్ని అందిస్తూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఆయ‌న కుమారుడు, మంత్రి నారా లోకేశ్‌ విజయం సాధించారని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కొనియాడారు. ఈ రోజు అమ‌రావ‌తిలో ఏపీ ఫైబర్ నెట్ ను ప్రారంభించి రాష్ట్ర ప్రజలకు అంకితం చేసిన విష‌యం తెలిసిందే.

ఈ సంద‌ర్భంగా న‌ర‌సింహ‌న్ మాట్లాడుతూ.... ఏపీలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారన్నారు. ఆధునిక టెక్నాలజీతో అతి తక్కువ ధరకే ఇంటర్ నెట్, కేబుల్ టీటీ, టెలిఫోన్ అందిస్తున్నారని, అనేక సౌకర్యాలను అందుబాటులోకి తీసుకువచ్చారని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ప్రభుత్వం అత్యున్నతమైన సౌకర్యాలు కల్పించిందని వ్యాఖ్యానించారు.  

  • Loading...

More Telugu News