President of India: విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న రాష్ట్రపతి సతీమణి

  • సవిత కోవింద్ కు పూర్ణ కుంభంతో స్వాగతం  
  • ప్రత్యేక పూజల నిర్వహణ
  • సవిత కోవింద్ వెంట మంత్రి అఖిలప్రియ, నన్నపనేని రాజకుమారి

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీమణి సవిత కోవింద్ ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మ వారిని దర్శించుకున్నారు. రాష్ట్రపతి దంపతులు ఈ రోజు అమరావతికి విచ్చేసిన సంగతి విదితమే. అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో కోవింద్ పాల్గొనగా, ఆయన సతీమణి సవిత కోవింద్ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్లారు.

ఈ సందర్భంగా ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం, అమ్మవారిని దర్శించుకున్న సవిత ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాగా, దేశ ప్రథమ పౌరురాలి వెంట మంత్రి అఖిలప్రియ, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి ఉన్నారు.

  • Loading...

More Telugu News