balakrishna: రజనీకాంత్ సినిమా ఛాయలతో 'జై సింహా'?

  • రెండు విభిన్నమైన పాత్రల్లో బాలకృష్ణ
  • ఆయన సరసన ముగ్గురు హీరోయిన్లు 
  • జనవరి 12న భారీస్థాయిలో రిలీజ్

బాలకృష్ణ 102వ సినిమాగా కె.ఎస్. రవికుమార్ దర్శకత్వంలో 'జై సింహా' సినిమా రూపొందింది. సంక్రాంతి కానుకగా ఈ సినిమాను జనవరి 12వ తేదీన భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు. బాలయ్య సరసన ముగ్గురు కథానాయికలు నటించిన ఈ సినిమాపై, అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి వుంది. తాజాగా ఈ సినిమా గురించిన టాక్ ఒకటి ఫిల్మ్ నగర్లో జోరుగా షికారు చేస్తోంది.

గతంలో రజనీకాంత్ చేసిన 'ముత్తు' తరహాలో ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. 'ముత్తు' సినిమా మాదిరిగానే ఈ సినిమాలోను బాలకృష్ణ రెండు పాత్రల్లో కనిపిస్తాడనీ, సెకండాఫ్ మొత్తం ఫ్యామిలీ సెంటిమెంట్ తో నడుస్తుందని చెబుతున్నారు. ఇవన్నీ ఊహాగానాలేననీ .. 'ముత్తు' సినిమా దర్శకుడు కె.ఎస్.రవికుమార్ కావడం వలన ఇలా ప్రచారం జరుగుతోందనే వారూ లేకపోలేదు. ఈ ప్రచారానికి తెరదించేస్తూ బాలకృష్ణ ఈ సంక్రాంతికి సంచలన విజయాన్ని అందుకుంటాడేమో చూడాలి మరి.        

  • Loading...

More Telugu News