rtc: ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌కు గుండెపోటు.. త‌ప్పిన ప్ర‌మాదం

  • ప్ర‌కాశం జిల్లా టంగుటూరు టోల్‌ప్లాజా వ‌ద్ద ఘ‌ట‌న‌
  • కావ‌లి నుంచి కొత్త‌ప‌ట్నం వెళ్తోన్న ఆర్టీసీ బ‌స్సు
  • డ్రైవ‌ర్ చాక‌చ‌క్యంతో ఊపిరి పీల్చుకున్న‌ 30 మంది ప్ర‌యాణికులు

ప్ర‌యాణికుల‌తో వెళుతోన్న ఓ ఆర్టీసీ బ‌స్సు పెను ప్ర‌మాదం నుంచి బ‌య‌ట‌ప‌డిన ఘ‌ట‌న టంగుటూరు టోల్‌ప్లాజా వ‌ద్ద చోటు చేసుకుంది. నెల్లూరు జిల్లా కావ‌లి నుంచి కొత్త‌ప‌ట్నం వెళ్తోన్న ఆర్టీసీ బ‌స్సు డ్రైవ‌ర్‌కి గుండెపోటు వ‌చ్చింది. దీంతో ఆ డ్రైవ‌ర్ బ్రేక్ వేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు. అయితే, అంతలోనే, టంగుటూరు టోల్‌ప్లాజా వ‌ద్ద ఓ హోర్డింగ్‌ను ఢీకొట్టిన బ‌స్సు అక్కడే ఆగిపోయింది.

ఈ ప్ర‌మాదం జ‌రిగిన స‌మ‌యంలో మొత్తం 30 మంది ప్ర‌యాణికులు బ‌స్సులో ఉన్నారు. వారంద‌రూ సుర‌క్షితంగానే బ‌య‌ట ప‌డ‌డంతో అంద‌రూ ఊపిరి పీల్చుకున్నారు. ఒంగోలు ఆసుప‌త్రికి డ్రైవ‌ర్‌ను త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు.

  • Loading...

More Telugu News