husband: భార్య విడాకులు ఇచ్చింద‌ని.. 80 మాత్ర‌లు మింగిన భ‌ర్త‌.. మృతి

  • నిజామాబాద్ జిల్లా భీమ్‌గ‌ల్ మండ‌లం బ‌డా భీమ్‌గ‌ల్‌లో ఘ‌ట‌న‌
  • తీవ్ర‌ మ‌న‌స్తాపం చెందిన భ‌ర్త‌
  • ఆసుప‌త్రిలో చికిత్స పొందుతూ మృతి

నిజామాబాద్ జిల్లా భీమ్‌గ‌ల్ మండ‌లం బ‌డా భీమ్‌గ‌ల్‌లో ఓ వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్నాడు. కొన్ని కారణాల వ‌ల్ల భార్య త‌న‌కు విడాకులు ఇచ్చింద‌ని మ‌న‌స్తాపం చెందుతోన్న ఆ వ్య‌క్తి ప‌లు మాత్ర‌లు సేక‌రించి వాటిని మింగేశాడు. అప‌స్మార‌క స్థితిలో ప‌డి ఉన్న అత‌డిని ఆసుప‌త్రికి త‌ర‌లించినప్పటికీ అత‌డి ప్రాణాలు ద‌క్క‌లేదు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. స‌ద‌రు వ్య‌క్తి పేరు రాజు (27) అని, సుమారు 80 మాత్ర‌లు మింగాడ‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది.

  • Loading...

More Telugu News