okhi cyclone: వెలుగు చూసిన దారుణ నిజం.. 131 మంది మత్స్యకారులు జాడ లేకుండా పోయారు

  • తమిళనాడు, కేరళలను అతలాకుతలం చేసిన ఓఖీ తుపాను
  • ఇప్పటి వరకు 74 మంది మృతదేహాలు మాత్రమే లభించాయి
  • కేరళ మత్స్యశాఖ మంత్రి అధికారిక ప్రకటన

ఓఖీ తుపాను తమిళనాడు, కేరళ రాష్ట్రాలను అతలాకుతలం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ తుపానుకు సంబంధించిన దారుణ నిజం వెలుగు చూసింది. ఆ సమయంలో చేపల వేట కోసం పడవల్లో వెళ్లిన మత్స్యకారులు పలువురు అదృశ్యం అయ్యారు. గల్లంతైన వారి కోసం హెలికాప్టర్లలో గాలించినా... కేవలం 74 మంది మృతదేహాలు మాత్రమే లభించాయి. మరో 131 మంది మత్స్యకారుల జాడ ఇంతవరకు లభించలేదు. ఈ విషయాన్ని సాక్షాత్తు కేరళ మత్స్యశాఖ మంత్రి మెర్సికుట్టీ వెల్లడించడం ప్రకంపనలు పుట్టిస్తోంది. మరోవైపు, అదృశ్యమైన మత్స్యకారుల కుటుంబాల్లో విషాదం అలముకుంది.

  • Loading...

More Telugu News