jayalalitha: జయలలిత సమాధి వద్ద నివాళులర్పించిన దినకరన్

  • మధురై నుంచి చెన్నై చేరుకున్న దినకరన్
  • కొనసాగుతున్న ఆర్కేనగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు
  • దూసుకెళ్తున్న దినకరన్

టీటీవీ దినకరన్ మధురై నుంచి చెన్నై చేరుకున్నారు. అనంతరం, జయలలిత సమాధి వద్దకు వెళ్లి నివాళులర్పించారు. కాగా, ఆర్కేనగర్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. శశికళ వర్గానికి చెందిన దినకరన్ భారీ మెజార్టీ దిశగా దూసుకువెళ్తున్నారు. పదకొండో రౌండ్ పూర్తయ్యేసరికి దినకరన్ కు 54,361 ఓట్లు లభించాయి. ఈ రౌండ్ పూర్తయ్యేసరికి అన్నాడీఎంకేకు 27,937 ఓట్లు, డీఎంకే కు14,481 ఓట్లు, బీజేపీకి 712 ఓట్లు, నామ్ తమిళర్ కట్చికి 2,347 ఓట్లు లభించాయి.

  • Loading...

More Telugu News