girl: గుడికి వెళ్లి ఒంటికి నిప్పంటించుకుని యువ‌తి ఆత్మ‌హ‌త్యాయ‌త్నం

  • నిజామాబాద్ జిల్లా భీంగల్‌ మండలం బడాభీంగల్‌లో ఘ‌ట‌న‌
  • కాలిపోయిన శ‌రీరం
  • ఆసుప‌త్రిలో యువ‌తి రాజ‌మ‌ణికి చికిత్స‌
  • కార‌ణాల‌పై పోలీసుల ఆరా

నిజామాబాద్ జిల్లాలోని భీంగల్‌ మండలం బడాభీంగల్‌ గ్రామంలో ఓ యువ‌తి శివాలయం గర్భగుడిలో ఆత్మ‌హ‌త్యాయ‌త్నం చేసింది. ఈ రోజు మ‌ధ్యాహ్నం గుడికి వ‌చ్చిన రాజమణి (19) అనే యువతి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ విష‌యాన్ని గుర్తించిన‌ స్థానికులు మంటలు ఆర్పేశారు.

అయితే, అప్ప‌టికే ఆమె శ‌రీరం చాలా వరకు కాలిపోయింది. వెంటనే ఆమెను ఆసుప‌త్రికి త‌ర‌లించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. ఆ యువ‌తి తల్లిదండ్రులు మృతి చెంద‌డంతో ఆమె ప్ర‌స్తుతం మేనమామ ఇంట్లో నివ‌సిస్తోంద‌ని, ఆమె ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తామ‌ని పోలీసులు చెప్పారు.    

  • Loading...

More Telugu News