Ram Nath Kovind: 24న మళ్లీ హైదరాబాద్ కు రాష్ట్రపతి.. 27న అమరావతికి పయనం

  • శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాదుకి రాక
  • 24న గవర్నర్ విందు
  • 27న ఏపీ రాజధానికి పయనం

తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన ప్రపంచ తెలుగు మహాసభల ముగింపు వేడుకలకు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ విచ్చేసిన సంగతి తెలిసిందే. ఈ నెల 24న ఆయన మళ్లీ హైదరాబాద్ వస్తున్నారు. 24 నుంచి 27వ తేదీ వరకు ఆయన బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో విడిది చేస్తారు. ప్రతి ఏటా శీతాకాల విడిదిలో భాగంగా డిసెంబర్ లో రాష్ట్రపతి హైదరాబాదుకు రావడం ఆనవాయతీ. 24న గవర్నర్ నరసింహన్ ఇచ్చే విందులో రామ్ నాథ్ పాల్గొంటారు. ఆ తర్వాత 26న రాష్ట్రపతి నిలయంలో తేనీటి విందు వుంటుంది. 27వ తేదీన రాష్ట్రపతి ఏపీ రాజధాని అమరావతికి వెళతారు.

  • Loading...

More Telugu News