Pawan Kalyan: మొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ చేసిన వ్యాఖ్య‌ల ప్ర‌కారం ఒక్క విష‌యంపై మాత్రం స్ప‌ష్ట‌త వ‌చ్చింది: ఉండ‌వ‌ల్లి

  • జ‌న‌సేన వైఖ‌రి నాకింకా అర్థం కాలేదు
  • మ‌రింత క‌న్ఫ్యూజ‌న్ పెరిగింది
  • జ‌గ‌న్‌, ప‌వ‌న్ క‌లిసి పోటీ చేయ‌బోర‌ని మాత్రం క్లారిటీ వ‌చ్చింది
  • టీడీపీతో జన‌సేన క‌లిసి వెళుతుందా? అన్న‌దాంట్లో స్ప‌ష్ట‌త లేదు

సినీన‌టుడు ప‌వ‌న్ క‌ల్యాణ్ పార్టీ జ‌న‌సేన వైఖ‌రి త‌న‌కింకా అర్థం కాలేదని మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ అన్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీతో క‌లిసి జ‌న‌సేన పోటీ చేస్తుందా? లేక ఒంట‌రిగా వెళుతుందా? అనే విష‌యం కూడా అర్థం కావ‌డం లేద‌ని చెప్పారు. తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో ఆయ‌న మాట్లాడుతూ... ప‌వ‌న్ క‌ల్యాణ్ పెట్టిన జ‌న‌సేన స‌భ‌ల త‌రువాత క‌న్ఫ్యూజ‌న్ మ‌రింత పెరిగింద‌ని అన్నారు. మొన్న ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడిన దాన్ని గ‌మ‌నిస్తే ఒక్క విష‌యంలో మాత్రం స్ప‌ష్టత వ‌చ్చింద‌ని, జ‌గ‌న్‌, ప‌వ‌న్ క‌లిసి పోటీ చేయ‌బోర‌ని తెలిసింద‌ని వ్యాఖ్యానించారు.  

అయితే, ఎప్పుడు ఏయే కంపెనీలు ఏ కంపెనీతో క‌లుస్తాయో చెప్ప‌లేమ‌ని, పార్టీలు కూడా అలాగేన‌ని అన్నారు. సంద‌ర్భాన్ని బ‌ట్టి ఏ పార్టీ ఏ పార్టీతోన‌యినా క‌లిసే అవ‌కాశాలూ లేక‌పోలేద‌ని అన్నారు. 2019లో ఏపీలో కాంగ్రెస్ పార్టీ గెలిచే అవ‌కాశాలు లేక‌పోయిన‌ప్ప‌టికీ, కేంద్రంలో బీజేపీని ఢీ కొట్టి గెలిస్తే మాత్రం కాంగ్రెస్ ఏపీ పున‌ర్విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌న్నీ నెర‌వేరుస్తుంద‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట‌ని మాత్రం నెర‌వేర్చుతుంద‌ని చెప్పారు.  

  • Loading...

More Telugu News