gopichand: గోపీచంద్ .. మెహ్రీన్ కొత్త సినిమా మొదలు

  • గోపీచంద్ హీరోగా తాజా చిత్రం 
  • దర్శకుడిగా చక్రి 
  • కథానాయికగా మెహ్రీన్        

ఈ మధ్య కాలంలో గోపీచంద్ కి చెప్పుకోదగిన హిట్ లేదు. దాంతో సరైన హిట్ కోసం ఆయన కొంతకాలంగా ఎదురుచూస్తున్నాడు. చక్రి దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి ఆయన అంగీకరించాడు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్  ఈ రోజున మొదలైంది.

రాధామోహన్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా మెహ్రీన్ నటిస్తోంది. ఈ సినిమాలో ఆమె టీచర్ పాత్రలో కనిపించనుంది. ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందనీ .. ఆడియన్స్ కు తప్పకుండా కనెక్ట్ అవుతుందని చెప్పింది. ఈ సినిమాను గురించి చక్రి మాట్లాడుతూ .. డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఈ సినిమా రూపొందుతోందని అన్నాడు. స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్ గా ఉంటుందనీ, గోపీచంద్ అభిమానులను ఆకట్టుకునేలా ఉంటుందని చెప్పాడు. గోపీచంద్ ఎదురుచూస్తోన్న హిట్ ఈ సినిమాతో ఆయనకి లభించడం ఖాయమనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.    

  • Loading...

More Telugu News