Narendra Modi: భావోద్వేగపూరితంగా మాట్లాడిన ప్ర‌ధాని మోదీ!

  • రెండు రాష్ట్రాల‌ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించినందుకు మోదీ, అమిత్‌షాకి స‌త్కారం
  • త‌న‌ దేహం దేశం కోస‌మేన‌న్న మోదీ
  • ఇందీరా గాంధీ హ‌యాంలో కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది
  • ఇప్పుడు బీజేపీ 19 రాష్ట్రాల్లో ఉంది

త‌న‌ దేహం దేశం కోస‌మే అని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌మోదీ భావోద్వేగపూరితంగా చెప్పారు. గుజ‌రాత్‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోదీ, బీజేపీ అధ్య‌క్షుడు అమిత్ షా నాయ‌క‌త్వంలో ఆ పార్టీ విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా వారిరువురికీ ఢిల్లీలో బీజేపీ పెద్ద‌లు స‌న్మానం చేశారు.

ఈ సంద‌ర్భంగా మోదీ మాట్లాడుతూ భావోద్వేగానికి గుర‌య్యారు. ఇప్పుడు బీజేపీ 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంద‌ని అన్నారు. మాజీ ప్రధాని ఇందీరాగాంధీ హ‌యాంలో కాంగ్రెస్ పార్టీ 18 రాష్ట్రాల్లోనే అధికారంలో ఉందని తెలిపారు. అధికారాన్ని సాధించ‌డం ప్రజల కోసమేన‌ని, వారికి మేలు చేయ‌డానికేన‌ని అన్నారు. తన నుంచి ఇంకా ఎంత పని ఆశిస్తున్నారో అదంతా చేసి చూపెడ‌తాన‌ని చెప్పారు.

  • Loading...

More Telugu News