Ram Nath Kovind: అమరావతిలో పర్యటించనున్న రాష్ట్రపతి కోవింద్.. భారీ భద్రతా ఏర్పాట్లు

  • ఈ నెల 27న అమరావతికి కోవింద్
  • నాగార్జున యూనివర్శిటీలో సదస్సుకు హాజరు 
  • ఫైబర్ గ్రిడ్ కు ప్రారంభోత్సవం

భారత రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ఏపీ రాజధాని అమరావతికి రానున్నారు. ఈ నెల 27వ తేదీన ఆయన అమరావతిలో పర్యటిస్తారని గుంటూరు జిల్లా కలెక్టర్ కోన శశిధర్, ఎస్పీ అప్పలనాయుడు తెలిపారు. పర్యటనలో భాగంగా తొలుత ఆయన ఆచార్య నాగార్జున యూనివర్శిటీ వద్ద ఏర్పాటు చేసిన ఎకనామిక్ సదస్సులో పాల్గొంటారని... ఆ తర్వాత వెలగపూడిలోని సచివాలయానికి చేరుకుంటారని తెలిపారు.

 సచివాలయం మొదటి భవనంలో ఏర్పాటు చేసిన రియల్ టైమ్ గవర్నెన్స్ సెంటర్ ను పరిశీలిస్తారని చెప్పారు. ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం చేపట్టిన ఫైబర్ గ్రిడ్ ను ప్రారంభిస్తారని వెల్లడించారు. రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని అప్పలనాయుడు తెలిపారు.

  • Loading...

More Telugu News