charan: ఆధిపత్య పోరాటమే నేపథ్యంగా 'రంగస్థలం'!

  • బోటు నడిపే వ్యక్తిగా చరణ్ 
  • మహాలక్ష్మి పాత్రలో సమంత 
  • చరణ్ అన్నయ్య పాత్రలో ఆది పినిశెట్టి 
  • మార్చి 30న ప్రేక్షకుల ముందుకు    

సుకుమార్ .. చరణ్ తో చేస్తోన్న సినిమాకి 'రంగస్థలం' అనే పేరు పెట్టగానే, ఈ సినిమా కథపై అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. అలాగే గ్రామీణ నేపథ్యంలో సినిమా కావడంతో చరణ్ .. సమంత .. ఆది పినిశెట్టి పాత్రలు ఎలా వుండనున్నాయనే విషయంలోను అందరిలో ఆసక్తి మొదలైంది. తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం .. ఈ సినిమాలో 'రంగస్థలం' అనేది ఊరు పేరట.

ఈ ఊరులో ప్రకాశ్ రాజ్ .. జగపతిబాబు మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందని అంటున్నారు. వాళ్లిద్దరి పాత్రలు పోటాపోటీగా కొనసాగుతాయనేది ఫిల్మ్ నగర్ టాక్. ఆ గ్రామానికి చెందిన చిట్టిబాబుగా చరణ్ బోటు నడుపుతూ జీవనం కొనసాగిస్తూ ఉండగా, గేదెలు కాసుకునే మహాలక్ష్మిగా సమంత కనిపించనుందని చెబుతున్నారు. ఇక చరణ్ అన్న పాత్రలో ఆది పినిశెట్టి నటిస్తున్నాడని అంటున్నారు. బలమైన కథా కథనాలతో కొనసాగే ఈ సినిమా, మార్చి 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.     

  • Loading...

More Telugu News