Madhu: టాలీవుడ్ నిర్మాత కార్యాలయంలో 'సెల్' గొడవ... పీఏపై దాడి!

  • నిర్మాత మధు కార్యాలయంలో గొడవ
  • పీఏ కడుపులో పొడిచిన సహాయకుడు
  • కేసు నమోదు చేసిన పోలీసులు

ఓ చిన్న గొడవ టాలీవుడ్ సినీ నిర్మాత మధు కార్యాలయంలో కత్తిపోట్లకు దారితీసింది. బంజారాహిల్స్ పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం, ఫిలింనగర్ లో మధు తన ఆఫీసును నిర్వహిస్తున్నాడు. ఇక్కడే మధు పీఏ సతీశ్, హెల్పర్ రవి ఉంటుంటారు. ఆదివారం రాత్రి రవి సెల్ ఫోన్ ను తీసుకున్న సతీశ్, తిరిగి దాన్ని ఇవ్వలేదు. తన సెల్ ఫోన్ తిరిగి ఇవ్వాలని సతీశ్ ను రవి డిమాండ్ చేశాడు.

ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. తన సెల్ ఫోన్ ఇవ్వడం లేదన్న కోపంతో కూరగాయలు కోసే కత్తిని తీసుకున్న రవి, దానితో సతీశ్ కడుపులో పొడిచాడు. విషయాన్ని చూసిన మిగతా కార్యాలయ సిబ్బంది, అతడిని అపోలో ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సతీశ్ పరిస్థితి విషమంగా ఉందని వైద్య వర్గాలు తెలిపాయి. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, రవిని అరెస్ట్ చేసి, విచారణ ప్రారంభించారు.

  • Loading...

More Telugu News