India: అదుపుత‌ప్పి గోడ‌ను ఢీ కొన్న శ్రీలంక క్రికెట‌ర్ల బ‌స్సు.. త‌ప్పిన ప్ర‌మాదం

  • రేపు శ్రీలంక‌, భార‌త్ చివ‌రి వ‌న్డే
  • విశాఖ‌ప‌ట్నంలోని ఓ హోట‌ల్‌లో ఇరు జ‌ట్లు బ‌స‌
  • ప్రాక్టీస్ కోసం బ‌స్సులో స్టేడియానికి వెళుతోన్న‌ శ్రీలంక జ‌ట్టు

రేపు జ‌ర‌గ‌నున్న ఫైన‌ల్ వ‌న్డే కోసం భార‌త్‌, శ్రీలంక క్రికెట్ జ‌ట్లు మొన్న‌ విశాఖ‌ప‌ట్నం చేరుకున్న విష‌యం తెలిసిందే. నిన్న‌ శ్రీలంక జట్టు సభ్యులు ప్రయాణిస్తోన్న బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. శ్రీలంక‌ జట్టు స్థానిక నోవాటెల్‌ హోటల్‌లో ఉంటోంది. అక్క‌డి నుంచి నెట్‌ప్రాక్టీస్ కోసం బ‌స్సులో స్టేడియానికి వెళ్తున్నారు. అయితే, వారు ప్రయాణిస్తోన్న బస్సు హోటల్‌ సమీపంలో అదుపుతప్పి ఓ గోడను ఢీకొట్ట‌డంతో అల‌జ‌డి చెల‌రేగింది. బ‌స్సు వేగం త‌క్కువ‌గా ఉండ‌డం, డ్రైవ‌రు వెంట‌నే అప్రమత్తమవడంతో పెద్ద ప్ర‌మాదం త‌ప్పింది.

కాగా, రేపు స్థానిక క్రికెట్ స్టేడియంలో ఇరు జ‌ట్ల మ‌ధ్య నిర్ణయాత్మ‌క వ‌న్డే జ‌ర‌గ‌నుంది. మూడు వ‌న్డేల సిరీస్‌లో తొలి వ‌న్డేలో శ్రీలంక విజ‌యం సాధించ‌గా, రెండో వ‌న్డేలో టీమిండియా గెలుపొందింది. రేపు జ‌రిగే చివ‌రి వ‌న్డేలో శ్రీలంక‌పై భార‌త్ గెలిస్తే వ‌న్డే ర్యాంకింగ్స్‌లో అగ్ర‌స్థానంలోకి వ‌చ్చే అవ‌కాశం ఉంది. ప్ర‌స్తుతం ఐసీసీ వ‌న్డే ర్యాంకింగ్స్ లో సౌతాఫ్రికా 120 పాయింట్ల‌తో మొద‌టి స్థానంలో, భార‌త్ 199 పాయింట్లతో రెండో స్థానంలో ఉన్నాయి.   

  • Loading...

More Telugu News