Kajal Agarwal: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • అలాంటివి పట్టించుకోనంటున్న కాజల్ 
  • 'జైసింహా' దుబాయ్ షూటింగ్ పూర్తి  
  • సాయిపల్లవి 'కణం' రిలీజ్ డేట్ 
  • తొలిసారి తెలుగులో సూర్య డబ్బింగ్

*  తన గురించి ఎవరు ఎలాంటి ప్రచారం చేసినా పట్టించుకోనని అంటోంది కథానాయిక కాజల్. ఇక కాజల్ పని అయిపోయిందనీ, మరెంతో కాలం హీరోయిన్ గా కొనసాగలేదని ఆమెపై కొందరు దుష్ప్రచారం చేస్తున్న విషయంపై అమ్మడు స్పందించింది. ఇవన్నీ ఇక్కడ మామూలేనని, అలాంటి ప్రచారాలను తాను పట్టించుకోనని, తన పని తాను చేసుకుంటూపోతానని ఈ ముద్దుగుమ్మ చెబుతోంది.  
*  నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న 'జైసింహా' చిత్రం షూటింగ్ మొత్తం నిన్నటితో పూర్తయింది. దుబాయ్ లో జరిగిన తాజా షెడ్యూలులో రెండు పాటలను చిత్రీకరించారు. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో నయనతార, నటాషా దోషి, హరిప్రియ హీరోయిన్లుగా నటించారు.
*  సాయిపల్లవి, నాగశౌర్య జంటగా తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'కణం' (తమిళంలో 'కరు') చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. నాలుగేళ్ల పిల్లకు సాయిపల్లవి తల్లిగా నటించిన ఈ చిత్రాన్ని ఫిబ్రవరి 9న విడుదల చేస్తారు.
*  తమిళ స్టార్ హీరో సూర్య తొలిసారిగా తెలుగులో డబ్బింగ్ చెబుతున్నాడు. విఘ్నేశ్ శివన్ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో రూపొందుతున్న 'గ్యాంగ్' చిత్రంలోని తన పాత్రకు సూర్య తొలిసారిగా డబ్బింగ్ చెప్పాడు. సూర్యకు తెలుగులో కూడా చాలా మంది అభిమానులున్న విషయం తెలిసిందే.    

  • Loading...

More Telugu News