Virat Kohli: ముంబైకి మకాం మార్చనున్న విరాట్ కోహ్లీ?

  • కోహ్లీ స్వస్థలం ఢిల్లీ
  • అనుష్క ఉండేది ముంబైలో
  • భార్య కోసం మకాం మార్చనున్న కోహ్లీ

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ భామ అనుష్క శర్మలు వివాహబంధంతో ఒక్కటయ్యారు. ఇప్పుడు ఒక ఆసక్తికర చర్చ ప్రారంభమైంది. కొత్త జంట ఎక్కడ కాపురం పెట్టబోతున్నారనేదే ఆ చర్చ. విరాట్ కోహ్లీ ఉండేది ఢిల్లీలో. అనుష్క ముంబైలో ఉంటుంది. బాలీవుడ్ లో నటీమణిగానే కాకుండా ప్రొడక్షన్ హౌస్ యజమానురాలిగా కూడా అనుష్క చాలా బిజీగా ఉంటోంది.

ఈ నేపథ్యంలో, తన భార్య కెరీర్ కు ఎలాంటి ఇబ్బంది కలగకూడదని కోహ్లీ భావిస్తున్నాడు. దీంతో, ముంబైకి మకాం మార్చడానికి సిద్ధమయ్యాడు. ముంబైలోని వర్లీలో ఈ కొత్త జంట కాపురం పెట్టబోతోందని సమాచారం. ఈ నెల 21 నుంచి దక్షిణాఫ్రికాలో టీమిండియా పర్యటించబోతోంది. ఈ సందర్భంగా విరాట్ తో పాటు అనుష్క కూడా సౌతాఫ్రికా వెళ్లబోతోందట. 

  • Loading...

More Telugu News