xiaomi: రూ. 1000 త‌గ్గిన షియోమి ఎమ్ఐ ఏ1 ధ‌ర‌

  • రూ. 13,999కే ల‌భ్యం
  • ఫ్లిప్‌కార్ట్‌, ఎమ్ఐ వెబ్‌సైట్ల‌లో అమ్మ‌కాలు
  • ఆవిష్క‌ర‌ణ ధ‌ర రూ. 14,999

గూగుల్‌తో ఒప్పందంలో భాగంగా షియోమి సంస్థ ప్రతిష్ఠాత్మ‌కంగా విడుద‌ల చేసిన ఎమ్ఐ ఏ1 ధ‌ర‌ను రూ. 1000 త‌గ్గించింది. ఆవిష్క‌ర‌ణ స‌మ‌యంలో రూ. 14,999గా ఉన్న ఈ ఫోన్ ధ‌ర ఇప్పుడు రూ. 13,999కి త‌గ్గింది. ఫ్లిప్‌కార్ట్‌, షియోమి అధికారిక వెబ్‌సైట్ ఎమ్ఐ.కామ్‌లో అమ్మ‌కానికి అందుబాటులో ఉంది.

ప్ర‌స్తుతం ఆండ్రాయిడ్ నౌగ‌ట్ ఓఎస్‌తో ప‌నిచేస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఓరియో, పీ వెర్ష‌న్‌ల‌కు కూడా అప్‌డేట్ చేసుకునే స‌దుపాయాన్ని గూగుల్ క‌ల్పించింది. మార్కెట్‌లో ఆన‌ర్ 7ఎక్స్ రావ‌డంతో వారికి కౌంట‌ర్ ఇచ్చేందుకు షియోమి ఈ ఫోన్ ధ‌ర‌ను త‌గ్గించిన‌ట్లు తెలుస్తోంది. హాన‌ర్ 7 ఎక్స్ ధ‌ర క‌నిష్టంగా రూ. 12,999 ఉంది. ఇందులో ఉన్న 18:9 యాస్పెక్ట్ డిస్‌ప్లే ఎమ్ఐ ఏ1లో లేదు.

  • Loading...

More Telugu News