Pawan Kalyan: చంద్ర‌బాబు న‌న్ను వాడుకుని వ‌దిలేస్తార‌ని కొంద‌రు చెప్పారు, నాకు తెలియ‌దా?: ప‌వ‌న్ కీల‌క వ్యాఖ్య‌

  • ప్ర‌జా శ్రేయ‌స్సు కోస‌మే నేను బీజేపీ-టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చాను
  • నాకు ఎమోష‌న్స్ ఏమీలేవు
  • మోదీని క‌లిస్తే కొంద‌రు చాలా ర‌క‌ర‌కాలుగా వ్యాఖ్యానించారు
  • ఇప్పుడు అదే మోదీని విమ‌ర్శిస్తోంటే వారు ఏమ‌య్యారు?

గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీకి మ‌ద్ద‌తు ఇస్తోంటే.. చంద్ర‌బాబు నాయుడు త‌న‌ను వాడుకుని వ‌దిలేస్తార‌ని కొంద‌రు త‌నతో చెప్పారని, త‌న‌కు తెలియ‌దా? అని సినీన‌టుడు, జ‌న‌సేన అధినేత‌ ప‌వ‌న్ క‌ల్యాణ్ కీల‌క వ్యాఖ్య చేశారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో ప‌వ‌న్ క‌ల్యాణ్ మాట్లాడుతూ... రాష్ట్రం, స‌మాజం, ప్ర‌జా శ్రేయ‌స్సు కోస‌మే తాను బీజేపీ-టీడీపీకి మ‌ద్ద‌తు ఇచ్చానని చెప్పుకొచ్చారు. పార్ల‌మెంటు తలుపులు మూసేసి రాష్ట్ర విభ‌జ‌న చేయ‌డం వ‌ల్లే తాను కాంగ్రెస్‌ను వ్య‌తిరేకిస్తున్నాన‌ని తెలిపారు.

ఓ కార్య‌క‌ర్త‌గా ఉండాల‌నే తాను గ‌తంలో ప్ర‌జారాజ్యం నుంచి పోటీ చేయ‌లేదని ప‌వ‌న్ క‌ల్యాణ్ అన్నారు. తాను ఎన్నో దెబ్బలు తిని వ‌చ్చానని, త‌న‌కు ఎమోష‌న్స్ ఏమీలేవని అన్నారు. తాను గ‌త ఎన్నిక‌ల‌ప్పుడు మోదీని క‌లిస్తే కొంద‌రు ర‌క‌ర‌కాలుగా వ్యాఖ్యానించారని, ఇప్పుడు తాను అదే మోదీని విమ‌ర్శిస్తోంటే వారు ఏమ‌య్యారు? అని ప్ర‌శ్నించారు.     

  • Loading...

More Telugu News