charan: 'రంగస్థలం'లో హైలైట్ గా బైక్ ఛేజింగ్ సీన్!

  • రామోజీ ఫిల్మ్ సిటీలో 'రంగస్థలం' షూటింగ్ 
  • ఉత్కంఠను రేకెత్తించే సీన్స్ చిత్రీకరణ
  • గ్రామీణ నేపథ్యం .. కథాకథనాలే ప్రధాన బలం

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై 'రంగస్థలం 1985' సినిమా రూపొందుతోంది. సుకుమార్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా, హైదరాబాద్ లో ప్రత్యేకంగా వేసిన విలేజ్ సెట్లో జరుగుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా .. రామోజీ ఫిల్మ్ సిటీలోను షూటింగ్ జరుపుకుంది. చరణ్ .. తదితరులు పాల్గొనగా బైక్ ఛేజింగ్ సన్నివేశాలను చిత్రీకరించారు.

బైక్ ఛేజింగ్ సీన్స్ అద్భుతంగా వచ్చాయట. ఆడియన్స్ లో ఉత్కంఠను రేకెత్తించేలా ఈ సీన్స్ ను చిత్రీకరించడం జరిగిందని అంటున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఇది నిలవనుందని అంటున్నారు. పూర్తిస్థాయి గ్రామీణ నేపథ్యంలో గ్రామీణ యువకుడిగా చరణ్ .. గ్రామీణ యువతిగా సమంత కనిపించనుండటమే ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. పల్లె అందాలతో పాటు పట్టుగా కొనసాగే కథాకథనాలు ప్రధానబలంగా నిలవనున్నాయని అంటున్నారు .  

  • Loading...

More Telugu News