guntur: కుమారుడు, కుమార్తెలను రైలు కింద తోసేసి.. తానూ దూకి ఆత్మ‌హ‌త్య చేసుకున్న‌ త‌ల్లి!

  • కుమార్తె పుట్టిన రోజు సంద‌ర్భంగా మా‌ర్టూరుకి వెళ్లిన విజ‌య‌ల‌క్ష్మి
  • తిరిగి వ‌స్తుండ‌గా ఆత్మ‌హ‌త్య‌
  • కుటుంబ క‌ల‌హాలే కార‌ణం
  • గుంటూరు జిల్లా నరసరావుపేట సమీపంలో ఘ‌ట‌న‌

కుటుంబ క‌ల‌హాల కార‌ణంగా ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో పాటు రైలు కింద‌పడి బ‌ల‌వన్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డ ఘ‌ట‌న గుంటూరు జిల్లా నరసరావుపేటలోని పెద్దమార్కెట్‌ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘ‌ట‌న‌పై కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు వివ‌రాలు తెలిపారు. నాదెండ్ల మండలం అప్పాపురం వాసి విజయలక్ష్మి త‌న ఇద్ద‌రు పిల్ల‌లు దిగ్విజ‌య‌, గ‌ణేష్‌ల‌ను మార్టూరులో చదివిస్తోంది.

ఈ రోజు త‌న‌ కుమార్తె దిగ్విజయ పుట్టిన రోజు కావడంతో మార్టూరు వెళ్లి అక్క‌డ‌ స‌ర‌దాగా గ‌డిపింది. మధ్యాహ్నం త‌న పిల్ల‌ల‌తో క‌లిసి నరసరావుపేట చేరుకున్న ఆమె అక్కడి ఫోటో స్టూడియోలో పిల్లలతో కలసి ఫోటోలు తీయించుకుంది. తర్వాత వాటిపై తమ వివరాలు రాసింది. అనంతరం రైల్వే గేటు సమీపంలోకి వెళ్లి గూడ్స్‌ రైలు వస్తుండగా పిల్లల్ని రైలు కిందకి తోసేసి, త‌రువాత తాను కూడా రైలు కింద పడింది. దీంతో వారు ముగ్గురూ అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘ‌ట‌న‌పై  పూర్తి స‌మాచారం అందాల్సి ఉంది. 

  • Loading...

More Telugu News