ram: రామ్ మూవీలో మళ్లీ ఇద్దరు హీరోయిన్లు

  • త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో రామ్
  • కథానాయికగా పరిశీలనలో నివేదా థామస్
  • మరో కథానాయికకు ఛాన్స్  

రామ్ హీరోగా ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఉన్నది ఒకటే జిందగీ' ఆయన అభిమానులను ఓ మాదిరిగా మాత్రమే మెప్పించగలిగింది. దాంతో ఈసారి పెద్దగా గ్యాప్ తీసుకోకుండానే ఆయన సెట్స్ పైకి వెళ్లడానికి రెడీ అవుతున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ సినిమాకి, నక్కిన త్రినాథరావు దర్శకుడిగా వ్యవహరించనున్నాడు.

 'ఉన్నది ఒకటే జిందగీ' సినిమాలో రామ్ ఇద్దరు హీరోయిన్స్ తో సందడి చేశాడు. తాజా చిత్రంలోను ఇద్దరు హీరోయిన్స్ వుండనున్నట్టు తెలుస్తోంది. ఒక హీరోయిన్ గా నివేదా థామస్ పేరు వినిపిస్తోంది. అయితే అది కూడా అధికారికంగా తెలియవలసి వుంది. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా రూపొందే ఈ సినిమాలో, రామ్ క్యారక్టరైజేషన్ డిఫరెంట్ గా వుంటుందట. యూత్ ను .. ప్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకునే ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు. ఈ సినిమాతో తప్పకుండా హిట్ కొట్టాలనే ఉద్దేశంతో రామ్ వున్నాడు.     

ram
  • Loading...

More Telugu News