balakrishna: బాలకృష్ణ - మహేశ్ బాబు మల్టీ స్టారర్.. బోయపాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిన హీరోలు?

  • మల్టీస్టారర్ చేయాలనుకుంటున్న బోయపాటి 
  • కథ వినేసిన బాలకృష్ణ .. మహేశ్ బాబు 
  • పూర్తి స్క్రిప్ట్ రెడీ చేసే పనిలో బోయపాటి     

ప్రస్తుతం చాలామంది దర్శక నిర్మాతలు హీరోల కాంబినేషన్ ను సెట్ చేయడంలో బిజీగా వున్నారు. ఎవరికి వారు మల్టీ స్టారర్ ను ప్లాన్ చేస్తున్నారు. ఒక వైపున ఎన్టీఆర్ - చరణ్ మల్టీస్టారర్ కి సంబంధించిన ఏర్పాట్లు జరిగిపోతూ ఉంటే, మరో వైపున బాలకృష్ణ - మహేశ్ బాబు మల్టీస్టారర్ కి రంగం సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.

 కొన్ని రోజుల క్రితమే బోయపాటి ఈ ఇద్దరు హీరోలను కలిసి కథ వినిపించాడట. ఇద్దరికీ బాగా నచ్చితేనే స్క్రిప్ట్ మీద కూర్చుంటానని బోయపాటి చెప్పడంతో, ఇటీవలే ఈ హీరోలు సూత్ర ప్రాయంగా తమ అంగీకారాన్ని తెలియజేసినట్టు సమాచారం. పూర్తి స్క్రిప్ట్ ను సిద్ధం చేసిన తరువాత కలిసి డిస్కస్ చేద్దామని బోయపాటితో అన్నారట. దాంతో ఆయన అందుకు సంబంధించిన కసరత్తు చేస్తున్నాడని అంటున్నారు. చరణ్ మూవీ తరువాత ఆయన చేసే ప్రాజెక్టు ఇదేనని చెబుతున్నారు.      

  • Loading...

More Telugu News