allu shirish: ఆసక్తిని రేకెత్తిస్తూ .. ఆత్రుతను పెంచుతోన్న 'ఒక్క క్షణం' టీజర్!

  • అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
  • ఇంట్రెస్టింగ్ కంటెంట్ ను ఎంచుకున్న వి.ఐ. ఆనంద్
  • కథానాయికలుగా సురభి .. శీరత్ కపూర్ 
  • ఈ నెల చివరిలో విడుదల    

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా టేకింగ్ పరంగా మంచి మార్కులు కొట్టేసింది. దర్శకుడిగా ఈ సినిమా వి.ఐ.ఆనంద్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆయన తాజా చిత్రంగా 'ఒక్క క్షణం' సినిమా తెరకెక్కింది. అల్లు శిరీష్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాలో ఆయన సరసన సురభి .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించారు. రీసెంట్ గా ఫస్టులుక్ ను వదిలిన ఈ సినిమా టీమ్ .. తాజాగా ఫస్టు టీజర్ ను రిలీజ్ చేసింది.

 ప్రధానమైన పాత్రలపై కట్ చేసిన టీజర్ చూస్తుంటే .. డైలాగ్స్ వింటుంటే ఈ సారి కూడా వెరైటీ కంటెంట్ తోనే వి.ఐ.ఆనంద్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్టుగా అర్థమవుతోంది. లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్, సినిమాపై ఆసక్తిని .. ఆత్రుతను పెంచుతోంది. "నేను ప్రేమించిన అమ్మాయి ప్రాణాల మీదకి వస్తే ఫేట్ తో నైనా .. డెస్టినీ తో నైనా .. చివరికి చావుతోనైనా పోరాడతాను" అంటూ అల్లు శిరీష్ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఈ నెల చివరిలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

  • Loading...

More Telugu News