charan: పల్లెటూళ్లలో పాటలకి రెడీ అవుతోన్న చరణ్

  • షూటింగు దశలో 'రంగస్థలం' 
  • రెండు రోజుల్లో టాకీ పార్టు పూర్తి 
  • ఆ తరువాత పాటల చిత్రీకరణ
  • మార్చిలో ప్రేక్షకుల ముందుకు

సుకుమార్ దర్శకత్వంలో చరణ్ కథానాయకుడిగా 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. జూబ్లీ హిల్స్ లోని ఓ కొండపై గ్రామం సెట్ వేసి చాలా వరకూ షూటింగును అక్కడ చేశారు. మరో రెండు రోజుల పాటు జరిగే షూటింగుతో టాకీ పార్టు పూర్తి కానుంది.

ఇక రెండు పాటలు మాత్రమే బ్యాలెన్స్ వున్నాయి. ఈ రెండు పాటలు కూడా గ్రామీణ నేపథ్యంలో చిత్రీకరించవలసినవే. గోదావరి జిల్లాల్లో ఈ పాటలను చిత్రీకరించనున్నట్టు చెబుతున్నారు. పల్లె అందాలను కళ్లకు కట్టేలా ఈ పాటలను చిత్రీకరించడానికి సుకుమార్ రెడీ అవుతున్నాడట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కథానాయికగా సమంత నటిస్తోంది. మార్చిలో విడుదలయ్యే ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందనే నమ్మకంతో చరణ్ వున్నాడు.     

  • Loading...

More Telugu News